Wednesday, May 15, 2024

Peddapalli: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే దాసరి..

జూలపల్లి (ప్రభ న్యూస్): పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బుధవారం జూలపల్లి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రోడ్డుపై పడి ఉన్న వారిని చూసి అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్షతగాత్రులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి పంపించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement