Monday, April 29, 2024

ADB: రూ.44.30కోట్ల నిధులు మంజూరు.. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

  • ఇటీవల నిర్మల్ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ముధోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి, మండల పరిషత్ కు, బైంసా మున్సిపాలిటీకి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జీవో నెంబర్ 352 DT : 29-08-2023 విడుదల చేసిందన్నారు.
  • నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు, మండల పరిషత్ కు రూ.20 లక్షలు, బైంసా మున్సిపాలిటీకి రూ.25 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement