Friday, May 10, 2024

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన కొమ్ము కొమురయ్య యాదవ్‌ కుటుంబానికి విద్యుత్‌ శాఖ ద్వారా మంజూరైన రూ. 5లక్షల ప్రమాదబీమా చెక్కును అతని భార్య నర్సమ్మకు ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు.

కొమురయ్య ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడని, బాధిత కుటుంబానికి ఎన్‌పీడీసీఎల్‌ ద్వారా పరిహారం చెక్కు మంజూరైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం, యాదవ సంఘం ట్రస్ట్‌ అధ్యక్షుడు మారం తిరుపతి, పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్‌ కుమార్‌, ట్రాన్స్‌కో ఏడీ, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement