Friday, April 26, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ కొరత..

ఓదెల: ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. మండల కేంద్రమైన ఓదెల, కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవటం కోసం ప్రజలు ఆస్పత్రులకు రాగా వ్యాక్సిన్‌ లేదని వైద్య బృందం చెప్పడంతో వచ్చినవారు వెనక్కి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత ఉందని, వ్యాక్సిన్‌ రాగానే తిరిగి వ్యాక్సిన్‌ టీ-కాలు ఇస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో వచ్చిన వారు ఏమీ చేయలేక నిరాశతో వెనుదిరిగారు. కోవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున వ్యాక్సీన్‌ కొరత లేకుండా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement