Thursday, April 18, 2024

కరోనా బాధితులకు సరుకుల పంపిణీ..

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రానికి చెందిన నిరుపేద గంట సత్తయ్య గౌడ్‌ కుటుంబం కరోనా వ్యాధి సోకి హోమ్‌ క్వారెంటైన్ లో ఉన్నారు. టిఆర్‌ఎస్‌ నాయకులు బండారి బాల్‌ రెడ్డి, జీపీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ కటుకం రామచంద్రంలు వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. సత్తయ్యగౌడ్‌, భార్య భాగ్య గత వారం రోజులుగా కరోనా వ్యాధి బారిన పడగా వైద్య సిబ్బంది హోమ్‌ క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు. నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న టిఆర్‌ఎస్‌ నాయకులు వెంటనే స్పందించి సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్‌ పందిర్ల శ్రీనివాస్‌గౌడ్‌, సలువాల శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement