Monday, April 29, 2024

సొసైటీ- బంకులో.. ఎప్పుడు నో స్టాక్‌ బోర్డే..

చిగురుమామిడి: మండలంలోని గునుకులపల్లి గ్రామంలో నిర్మించిన చిగురుమామిడి సొసైటీ- ఆధ్వర్యంలో ప్రారంభించిన డిజిల్‌ బంకులో రైతులకు ఎప్పుడు నో స్టాక్‌ బోర్డ్‌ దర్శనమివ్వడం గమనార్హం. రైతులకు అందుబాటు-లో ఉండే డీజిల్‌ మాత్రమే దొరుకుతుంది. పెట్రోలు ఉండదు.. డిజిల్‌ కూడా ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నో స్టాక్‌ బోర్డు ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి-కై-నా అధికారులు, ప్రజాప్రతినిధులు సొసైటీ- బంకును పట్టించుకోవాలని గునుకులపల్లి సర్పంచ్‌ గునుకుల అమూల్య మధుసూదన్‌రెడ్డి, ఉపస ర్పంచ్‌ కూన పోచయ్య, రెడ్డి సంఘం అధ్యక్షులు కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, రైతులు భీమర లక్ష్మణ్‌, సంపత్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు బంకు వద్ద నిరసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement