Saturday, April 27, 2024

TS: మాదిగలకు ఎంపీ సీట్లు ఇవ్వాలి… చలో ఏఐసీసీ కార్యాలయం

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి, వరంగల్ స్థానాలను మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగ దండోరా, మాదిగ జేఏసీల ఆధ్వర్యంలో ఢిల్లీలో చలో ఏఐసీసీ కార్యాలయం పేరిట నిరసన నిర్వహించారు. మాదిగ దండోరా జేఏసీ నాయకులు ప్లకార్డులు చేతబూని ఎంపీ టికెట్లు కేటాయించాలని నినాదాలు చేశారు.

అనంతరం మాట్లాడుతూ…. మాదిగలను ఓట్ల కోసం వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. వెంటనే పెద్ద పెళ్లి పార్లమెంట్ టికెట్ ను మాదిగలకు కేటాయించాలన్నారు. గజ్జలకాంతం, పిడమర్తి రవి లకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement