Friday, May 3, 2024

హనుమాన్ చాలీసా పారాయణంలో ఎమ్మెల్సీ కవిత.. అంజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జ‌రిగిన‌ హనుమాన్ చాలీసా పారాయణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవిశంకర్ ఉన్నారు. కొండగట్టులో బేతాళస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు కవిత. అనంతరం అంజ‌న్న‌ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఎనభై ఒక్క రోజులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించామని, కరోనా కారణంగా చాలా మంది భక్తులు ఇళ్లలోనే పారాయణం చేశారని చెప్పారు. హనుమాన్ దయవల్ల తెలంగాణ ప్రజలు సుభిక్షంగా కోరుకున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement