Thursday, April 25, 2024

విధుల్లో అల‌స‌త్వం వ‌హిస్తే స‌హించేది లేదు.. విద్యుత్ అధికారుల బ‌దిలీకి ఫోరం తీర్మానం

మ‌రిపెడ‌, (ప్ర‌భన్యూస్‌): అధికారులు విధుల్లో అల‌స‌త్వం వ‌హిస్తే స‌హించేది లేద‌ని, అంద‌రూ ప్ర‌జా క్షేత్రంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ అన్నారు. శ‌నివారం మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మండ‌ల కేంద్రంలోని మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఎంపీపీ గుగులోత్ అరుణ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు గ్రామాల ప్ర‌జాప్ర‌తినిధులు లేవ‌నెత్తిన స‌మ‌స్య‌ల‌పై అధికారుల‌ను స‌కాలంలో పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశానికి గైర్హాజ‌ర‌వుతున్న అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూడు ద‌ఫాలుగా స‌మావేశాల‌కు గైర్హాజ‌ర‌వుతూ.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అల‌స‌త్వం వ‌హిస్తున్న విద్యుత్ అధికారుల‌ను బ‌దిలీ చేయాల్సిందిగా ట్రాన్స్‌కో సీఎండీకి కోరం ఏక‌గ్రీవ తీర్మానం చేసి పోస్టు చేయాల్సిందిగా సూచించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించి ప‌రిష్కారాల‌కు తీర్మానం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement