Sunday, May 5, 2024

Breaking: కేజ్రీవాల్​తో కలిసి ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవ్వాల ప‌లువురు లీడ‌ర్ల‌తో వరుస భేటీలు జ‌రిపారు. యూపీ విపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌తో స‌మావేశ‌మైన కేసీఆర్, ఆ త‌ర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీ భాగ్ లోని ఆ స్కూల్‌ని సంద‌ర్శించి అక్కడి సౌల‌తులు, తరగతి గదులను పరిశీలించారు. స‌ర్కారు స్కూళ్ల‌లో ప‌రిస్థితుల‌పై కేజ్రీవాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వీరిరువురు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లను కూడా సందర్శించనున్నారు. జాతీయ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 22న చండీగఢ్ వెళ్లనున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన 600 మంది అన్నదాతల కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లతో కలిసి కేసీఆర్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement