Thursday, May 2, 2024

కఠోర సాధన చేయండి: యువతకు ఎమ్మెల్యే సంజయ్ సూచన

ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుందని యువత కఠోర సాధన చేయాలని జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించి, పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన వాకింగ్ ట్రాక్  పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ ఉద్యోగ నియామక శిక్షణ అభ్యర్థులతో కలిసి ముచ్చటించారు. దాదాపు 200 మందికి అంబలి,రాగి మాల్ట్ సౌకర్యం కల్పించాలని ఎమ్మేల్యేకు విన్నవించగా 60 రోజులకు సరిపడా 1 లక్ష 20వేల రూపాయల విలువగల అంబలి, రాగి మాల్ట్ అందజేస్తానని హామీ ఇచ్చారు. తక్షణమే స్పందించి హామీ ఇచ్చిన ఎమ్మేల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement