Tuesday, April 30, 2024

బీఆర్ఎస్ లో భారీ చేరికలు.. ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి

కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో గులాబీ గూటిలో చేరారు. మాజీ ఎంపీటీసీ ప్రమీల-రాజయ్య, మొట్లపల్లి ఉప సర్పంచ్ రాందేని మల్లేష్ , ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు చిలుముల రాజు, వార్డు సభ్యులు పోచంపల్లి లక్ష్మీ-రాములు,హనుమ కుమార్, కోట శ్రీనివాస్, జంగం అనిల్ కుమార్, శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యులు కత్తుల వీరయ్య, మేర్గవేన కుమార్, అల్లంల కుమార్ లకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితి లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య,రైతు బంధు మండలాధ్యక్షుడు నిదానపురం దేవయ్య,ఛైర్మెన్ కొట్టే సుజాత-రవి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష-అనిల్, ఛైర్మెన్ లు చదువు రామచంద్రారెడ్డి, గజవెల్లి పురుషోత్తం, కో ఆప్షన్ ఇబ్రహీం,వైస్ ఛైర్మెన్ లు సంధ్య-వెంకట్ రెడ్డి, భూషి సదాశివ రెడ్డి, మాజీ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతి రెడ్డి,యూత్ మండలాధ్యక్షుడు నూనెటి కుమార్, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి-రాజు, ఎంపీటీసీ సువర్ణ-చంద్రు, ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement