Friday, April 26, 2024

టిటిడీ ఈ.ఓ ధ‌ర్మారెడ్డిన ప‌రామ‌ర్శించిన‌.. స‌జ్జ‌ల‌..మంత్రి విశ్వ‌రూప్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ.ఓ. ఏవి. ధర్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.విశ్వరూప్, వైయస్ఆర్ సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు.. కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య, వైయస్ఆర్ సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు .. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలు పరామర్శించారు. పుత్రవియోగంతో బాధపడుతున్న టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని సజ్జల రామకృష్ణ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. సోమవారం జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో ఆయన స్వగృహానికి వెళ్లి .. ఆకస్మికంగా మ‌ర‌ణించిన టిటిడి ఈ.ఓ. ఏవి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డిని ఆలింగనం చేసుకొని ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement