Tuesday, May 7, 2024

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జన్మదిన వేడుకలు..

జూలపల్లి: మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జన్మదిన వేడుకలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడే నాయకుడు మంత్రి కొప్పుల అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్‌ పుల్లూరు వేణుగోపాలరావు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ లోక రవీందర్‌రెడ్డి, ముత్తు లింగం, ఎంపీటీ-సీ దండే వెంకటేశ్వర్లు, రాజలింగం, నల్లాల కనకరాజు, కాంతయ్య, వీసారపు వెంకటేశం, వెంకటరమణ, మేర శ్రీనివాస్‌, అంకుస్‌, బీరయ్య, చంద్రయ్యలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement