Wednesday, May 8, 2024

దంపతుల నుంచి కరోనా వస్తుందని అమానుషం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. అయితే కరోనా పాజిటివ్ వస్తేనేకాదు… ఎవరిలో అయినా ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నా జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారిని ఏ మాత్రం దరిచేరనివ్వడం లేదు. కరోనా వైరస్ పట్ల అవగాహన లేక కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్య, భర్తకు కరోనా పాజిటివ్ వచ్చిందని వాళ్ల ఇంటికి తాళం వేశారు. వారు బయటకు వస్తే తమకు ఎక్కడ అంటుకుంటుందోనని అనుమానంతో ఫ్లాట్ కు తాళం వేశారు అపార్ట్ మెంట్ వాసులు. తాళం తీయమని ఎంత ప్రధేయపడినా వారు వినిపించుకోలేదు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తాళం తీసేందుకు వెళ్లిన పోలీసులతోనూ వాగ్వాదం చేశారు.

దంపతులు ఇద్దరికి కరోనా రావడంతో మందుల కోసం తన కుమారుడిని బయటకు పంపించామని బాధిత మహిళ తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుమారుడిని బయటకి పంపించినట్లు తెలిపింది. క్వారంటైన్‌ లో ఉన్న తమపై అపార్ట్ మెంట్ వాసులు దారుణంగా ప్రవర్తించారని ఆదేదన వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement