Tuesday, May 7, 2024

క‌రోనా టీకా వేయించుకున్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

క‌రీంన‌గ‌ర్ – మంత్రి గంగుల క‌మలాక‌ర్ నేడు క‌రోనా టీకా వేయించుకున్నారు.. క‌రీంన‌గ‌ర్ లోని ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రికి వెళ్లిన ఆయ‌న అక్క‌డ క‌రోనా వ్యాక్సిన్ తొలి డోస్ ను తీసుకున్నారు.. అంత‌కుముందు ఆయ‌న హాస్ప‌ట‌ల్ ను సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. కొవిడ్ ప‌రీక్ష‌ల‌ను ప‌రిశీలించారు.. వ్యాక్సిన్ ఎంత స్టాక్ ఉందో వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, 45 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు.. వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహాలు లేవ‌ని అన్నారు.. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ లు ధ‌రించాల‌ని కోరారు… అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement