Wednesday, May 15, 2024

చెన్నూరులో మెగా రక్తదాన శిబిరం .. హాజరైన బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినొత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదివారం చెన్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకు వెళ్తున్న నాయకుడు తారక రాముడు అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం కేటీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అనంతరం రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement