Thursday, May 2, 2024

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజీవ్ రహదారి పైకి వరద నీరు చేరింది. నిత్యం రద్దీగా ఉండే పెద్దపల్లి రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సివిల్, ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. శుక్రవారం రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ అనిల్, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు మహేందర్, మల్లేష్ లు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement