Monday, April 29, 2024

మంత్రి కేటీఆర్ కు బాల్క సుమన్ కృతజ్ఞతలు

మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమించినందుకు బాల్క సుమన్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయగా బాల్క సుమన్ ను మంత్రి కేటీఆర్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలో తెరాస పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బాల్క సుమన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement