Thursday, May 16, 2024

Dengue : డెంగీ జ్వరంతో వ్యక్తి మృతి..

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం బొంపెళ్ళికి చెందిన అరికిల్ల స్వామి డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఆసుపత్రిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్వామి కొన్ని రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ పెద్దపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్కడ నయం కాక పోవడం, రక్త కణాలు క్షీణించడంతో కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందించినా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. గ్రామంలో ఎస్సీ కాలనీలో జ్వరాల బారిన పడి జనం విలవిలలాడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. స్వామి మృతితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన స్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కొరారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement