Monday, April 29, 2024

TS: నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా తిరిగి వ‌చ్చింది… మాజీఎంపీ వినోద్ కుమార్

నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అని మాజీ ఎం పి, కరీంనగర్ పార్లమెంటు అభ్య‌ర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్యూ న్యూస్‌లో తీన్మార్ మలన్నత‌న అన్నబిడ్డ స్వప్న కు జెన్కోలో అర్హత లేకున్నా సి ఎం డి ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చారని వార్త ఇచ్చారని, త‌న‌కు అన్ననే లేడు స్వప్న కు త‌మ‌కు బంధుత్వం లేదన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ఇవ్వడం ఏమిటి క్రాస్ చెక్ చేసుకొని వార్త ఇవ్వాలని దాన్నే జర్నలిజం అంటార‌న్నారు. బోయినపల్లి ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. నేను ఎం పి గా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఏ అధికారికారి పైన అయిన ఒత్తిడి చేసాను చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా బధనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక నేరగాడు నీరజ్ మోడీ నరేంద్ర మోడీ బంధువులు అవుతారా బి జె పి సోషల్ మీడియా మిత్రులు గ్రహించాలన్నారు. రాజకీయ పోరాటం ఉండాలి కానీ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అమ్మాయికి నాకు సంబంధం ఏమిటి ప్రూ చేయగలరా అని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రానివ్వండి ఎవరు ఏమి చేశారో చెపుతనని హెచ్చరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement