Friday, May 3, 2024

AP: క‌ర్నూల్ జిల్లాలో దారుణం… ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి హత్య

తుగ్గలి, జనవరి 7(ప్రభ న్యూస్): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ రైల్వే జంక్షన్‌లో వైకాపా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు పూజారి రాము(59) హత్యకు గురయ్యారు. పూజారి రాము 1985 నుండి 1991 వరకు నల్లమల ఫారెస్ట్ లో బోనాసి దళం కమాండర్ గా పనిచేశారు.

అలాగే ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరి పోతుల సునీత వైఎస్ఆర్సిపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన మానసిక పరిస్థితి సక్రమంగా లేక మతిస్థితి కోల్పోయి పెండేకల్ రైల్వే జంక్షన్ లోనే ఉన్నారు. అయితే శనివారం రాత్రి హత్యకు గురికావడం జరిగింది. ఈ హత్యపై తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తమ్ముడు ఉద్యమకారుడు పూజారి లెనిన్ బాబు మాట్లాడుతూ తమ అన్నను ఎవరో హత్య చేయడం చాలా బాధాకరమని ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఆర్ఎస్ పెండేకల్లు లో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement