Sunday, April 28, 2024

Siddipet: ట్రాన్స్ జెండ‌ర్‌గా మారిన భ‌ర్త‌… సుపారి ఇచ్చి హ‌త్య చేయించిన భార్య‌

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భ‌ర్త ట్రాన్స్‌జెండ‌ర్‌గా మారి వేధిస్తున్నాడ‌నే నేప‌థంతో భార్య సుపారి ఇచ్చి హ‌త్య చేయించింది. ఈ ఘ‌ట‌న సిద్దిపేట‌లోని బోయిగ‌ల్లీలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

2014లో వేద శ్రీ, వెంకటేష్ కి వివాహం కాగా 2015 లో ఓ పాప జన్మించింది. 2015 తర్వాత వెంకటేష్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయట. చీర కట్టడం, చెవులకు కమ్మలు పెట్టడం, గాజులు తొడుక్కోవడం వంటివి చేశాడట వెంకటేష్.ఇక 2019లో ట్రాన్స్ జెండర్ గా మారి తన పేరును రోజాగా మార్చుకున్నాడట వెంకటేష్. అప్పటి నుంచి భార్య వేద శ్రీ ని వేధించడం మొదలుపెట్టాడు.. తన భర్తని హత్య చేయించాలని 2023 సెప్టెంబర్ లో రమేష్ కి 18 లక్షలకి సుపారి ఇచ్చింది అతని భార్య‌. అడ్వాన్స్ కింద 4.60 లక్షల రూపాయలు చెల్లింపు చేసింది. గత ఏడాది 2023 డిసెంబర్ 11న వే వెంకటేష్ ని మద్యం తాగించి హత్య చేశాడు రమేష్. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement