Saturday, May 18, 2024

అండర్‌ మేనేజర్‌పై భూ నిర్వాసితుల దాడి

రామగిరి, జూన్‌ 4 (ప్రభన్యూస్‌): పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని లద్నాపూర్‌ గ్రామంలో అనుమతి లేని ఇళ్లను కూల్చేందుకు అధికారులు యత్నిస్తున్న క్రమంలో భూ నిర్వాసితులు సింగరేణి ఓసీ పీ2 అండర్‌ వెనేజర్‌ కిషన్‌కుమార్‌పై దాడి చేశారు. గాయపడ్డ అండర్‌ మేనేజర్‌ను చికిత్స నిమిత్తం స్థానిక డిస్పెన్సరీకి తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు పని చేస్తున్న తమపై దాడి చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా అధికారుల సంఘం ఖండించారు. అధికారులపై దాడులు చేస్తే పనులు ఎలా జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement