Monday, April 29, 2024

మూడో సారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే… శ్రీవారి సన్నిధిలో మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించారు.

దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు మంత్రి దంపతులకు వేధ ఆశీర్వచనం అందించగా, టిటిడి ఆలయ అధికారులు స్వామీ వారి పట్టు వస్త్రాలను,తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ సహకారంతో కరీంనగర్ లో 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణ రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ ఆస్తిగా భవిస్తారని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మూడో సారి కూడా ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ వెంట కరీంనగర్ టిఆర్ఎస్ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement