Tuesday, May 14, 2024

HYD: రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

హైదరాబాద్ నగరంలో జరిగిన రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె చనిపోయింది. శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద ఈరోజు తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అయితే ఈ రోడ్డుప్రమాదంలో మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియాగా (25) గుర్తించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.

Also Read:

Advertisement

తాజా వార్తలు

Advertisement