Tuesday, May 14, 2024

అసలైన రైతు బాంధవుడు కేసీఆర్ .. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

అసలైన రైతు బాంధవుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో రైతుబంధు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ కర్షకులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగానికి పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ఏడాదికి రెండుసార్లు ఎకరానికి 5000 చొప్పున రూ.10 వేల పెట్టుబడి అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర రైతాంగమంతా గుండెల్లో పెట్టుకున్నారన్నారు. 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.7677 కోట్లు వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఇప్పటివరకు రూ. 65, 558 కోట్లు రైతుల ఖాతాల్లో చేరాయన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనని, రైతు బీమా ద్వారా మృతిచెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున 94,500 మంది రైతు కుటుంబాలకు 4725 కోట్ల రూపాయలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో పాటు రైతు సమన్వయ సమితి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement