Monday, May 6, 2024

KNR: గులాబీ గూటిలో భారీ చేరికలు.. ఆహ్వానించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

కోరుట్ల గులాబీ పార్టీలో చేరికల పరంపర ప్రతినిత్యం కొనసాగుతోంది.. ప్రతినిత్యం నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

గురువారం మల్లాపూర్ మండలం చిట్టాపూర్, సంగెం గ్రామాలకు చెందిన దాదాపు 300మంది ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డా.సంజయ్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా 24గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement