Wednesday, May 1, 2024

రెండో రోజూ శ్రీవారి ఆలయం మీదుగా పయనించిన విమానం

తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. శ్రీవారి ఆలయం మీదుగా తరుచూ విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఇవాళ మరోసారి ఆలయ గోపురం మీదుగా విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

బుధవారం నాడు కూడా శ్రీవారి ఆలయ సమీపంలో విమానం ప్రయాణించింది. టీటీడీ విజ్ఞప్తిని విమానాశ్రయ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్ర విమానయాన శాఖ నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement