Tuesday, May 7, 2024

జూలపల్లిలో హైపోక్లోరైట్‌ స్ప్రే..

జూలపల్లి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా మండల కేంద్రంలో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కుస్కుంట్ల రమాదేవి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. యూనియన్‌ బ్యాంకు నుంచి అంబేద్కర్‌ స్టాచ్యు పరిసరాలలో స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీఓ, కార్యదర్శి లచ్చయ్య, రమేష్‌, అమరగాని ప్రదీప్‌, మేర శ్రీనివాస్‌, సతీష్‌, రమేష్‌, కొమురయ్య, పురుషోత్తం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement