Thursday, May 2, 2024

ఇళ్ళు దగ్ధం.. ఆస్తి నష్టం

ఎల్లారెడ్డిపేట: మండలంలోని దుమాల గ్రామంలో తురుక కాశివాడలో షేక్‌ బిబి భర్త మౌలానా, సయ్యద్‌ అంకుష్‌ తండ్రి కమల్‌ రెండు ఇళ్లు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. షేక్‌ బేబీకి చెందిన ఇంట్లో రూ. 70 వేలు, అర్ధ తులం బంగారం, రెండు క్వింటాళ్ల బియ్యం, బట్టలు, సామాగ్రి పూర్తిగా బూడిదయ్యాయి. సయ్యద్‌ అంకుష్‌ ఇంట్లో రూ. లక్షా 20వేల నగదు, బట్టలు, వంటసామాన్లు, క్వింటా బియ్యం కాలిపోయాయి. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సర్పంచ్‌ కదిరే రజిత శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ కదిరే భాస్కర్‌లు కోరారు. తక్షణ సహాయం కింద సర్పంచ్‌ 30 కిలోల బియ్యం, రూ. వెయ్యి నగదు అందించారు. వైస్‌ ఎంపీపీ నిత్యవసర వస్తువులు రెండు కుటుంబాలకు అందించారు. మాజీ ఎంపిటిసి కొలనూరు శంకర్‌ రూ. వెయ్యి, ఉపసర్పంచ్‌ హనుమంతు రూ. 500, చెటుకూరి రాజు 50 కిలోల బియ్యం, ప్రభు కుమార్‌ 25 కిలోల బియ్యం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement