Thursday, May 2, 2024

హనుమాన్‌ దీక్షల విరమణ..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో రాజేశం గురు స్వామి చేతుల మీదుగా హనుమాన్‌ దీక్ష చేపట్టిన మాలధారులు దీక్షలు విరమించారు. గ్రామంలో 70 మంది హనుమాన్‌ దీక్ష చేపట్టారు. కరోనా తీవ్రత మూలంగా ఆలయాలలో కరోనా నిబంధనలు ఉండగా, వారంతా కొండగట్టు, అగ్రహారం తదితర ప్రముఖ హనుమాన్‌ దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో హనుమాన్‌ భక్తుడు, సీనియర్‌ మాల దారుడు, బిజెపి నాయకుడు అయిన పట్టూరి రాజేశం గుప్త గ్రామంలోని రామాలయంలో హనుమాన్‌ మాలదారులచే దీక్షలు విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ భీమయ్య, దండు శ్రీనివాస్‌ లతో పాటు పలువురు హనుమాన్‌ దీక్ష పరులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement