Monday, May 6, 2024

బావిలో పడిన బామ్మ.. కాపాడిన ఫైర్ సిబ్బంది..

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సంజీవ్ నగర్ కాలనీకి చెందిన ఉండుంటి మదనమ్మ మంగళవారం ఉదయం ఇంటి ఆవరణలో ఉన్న చాద బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తన కుమారుడు ఉండుంటి రవీందర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రిస్కు చేసి మదునమ్మ ను సురక్షితంగా బావిలో నుండి బయటకు తీశారు. ప్రాణాలతో సురక్షితంగా కాపాడిన ఫైర్ సిబ్బందికి మద‌న‌మ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భూదయ్య, లీడింగ్ ఫైర్ మెన్ జి. ధర్ము,ఫైర్ మెన్ పి.సంతోష్ కుమార్, డ్రైవర్ ఆపరేటర్ యు, వినోద్ కుమార్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement