Wednesday, May 15, 2024

బాధితులకు అండగా ప్రభుత్వం : మంత్రి కొప్పుల

ధర్మారం, (ప్రభన్యూస్‌): భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కూలి ఆస్తి నష్టం సంభవించిన 28 కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 3800 చొప్పున పరిహారం నగదు రూపంలో మొత్తం రూ. 95వేలను అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో ఎంతో మంది పేదలు నష్టపోయారని, రైతుల పంటలు నష్టపోయారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు పరిహారం అందిస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement