Monday, April 29, 2024

గొల్లపల్లిలో సంపూర్ణ బంద్..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని గొల్లపల్లిలో కరోనా కేసులు తీవ్ర మవుతున్న దృష్ట్యా గ్రామపంచాయతీ సంపూర్ణ బంద్‌కు పిలుపునివ్వడంతో గొల్లపల్లిలో పూర్తి బంద్‌ కొనసాగుతుంది. గ్రామంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నందున గ్రామంలో పూర్తిగా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేసి గ్రామాన్ని పరిశుభ్రం చేయాలని నిర్ణయించిన గ్రామపంచాయతీ అధికారులు, సర్పంచ్‌, పాలక వర్గం బంద్‌ పాటించాలని వ్యాపారులను, ప్రజలను కోరారు. ప్రతి శనివారం గ్రామంలో నిర్వహించే వారసంతను కూడా బంద్‌ చేయించిన పాలకవర్గం… పంచాయతీ ఆదేశాలు పాటించకుండా షాపులు తీసే వారికి రూ.2 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో గొల్లపల్లి గ్రామంలో అన్ని రకాల వ్యాపారాలు, హోటల్‌ ళ్లు మూత పడ్డాయి. గ్రామంలో సంపూర్ణ బంద్‌ జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement