Tuesday, May 7, 2024

ఘనంగా మాజీ స్పీకర్ జయంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, మంథని మాజీ ఎమ్మెల్యే దివంగత దుద్దిల్ల శ్రీపాద రావు 85వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమర్ రహే శ్రీపాద రావు అమర్ రహే.. శ్రీపాద రావు ఆశయాలను సాధిద్దాం..అంటూ నినాదాలు చేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం గేటు ఎదుట 500 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాద రావు అజాత శత్రువుగా, టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసినా.. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానంటూ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కొండంత అండగా నిలిచి వారికి ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నేత అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంథని ఎమ్మెల్యేగా,  శాసనసభ స్పీకర్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం, కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో ఘననీయమైన అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement