Monday, April 29, 2024

ఘనంగా మాజీ ప్ర‌ధాని పీవీ జయంతి

భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఉజ్వల పార్కులోని ఆయన విగ్రహానికి కరీంనగర్ న‌గర మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చార‌న్నారు.

దేశానికి పీవీ ఎన‌లేని సేవ‌లు చేశార‌ని గుర్తు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మునిసిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలేంధర్ యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు కాల్ శెట్టి శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement