Tuesday, April 30, 2024

మహాత్ముని ఆశయసాధనకు కృషి : కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల..

మహాత్మాగాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పీర్ల కొమురయ్య పిలుపునిచ్చారు ఆదివారం పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం సత్యం అహింస మార్గాల్లో శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్య్ర ఫలాలను దేశానికీ అందించిన మహా నాయకుడు మహాత్మా గాంధీ అన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాంధీజీ భాటలో నడవాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నుగిల్ల మల్లయ్య, శ్రీమాన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పూదరి చంద్ర శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కే సర్వర్, జిల్లా కార్యదర్శి పి యస్ విజయ్ కుమార్, మసూద్, ఫసి, ఫయాజ్, ప్రశాంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement