Saturday, May 4, 2024

కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు… మళ్ళీ మనదే అధికారం.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్, ఆగష్టు 8(ప్రభ న్యూస్): కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మొద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పెద్దపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల కాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి ఒరగబెట్టిందో చెప్పాలన్నారు. బీఅర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతీ కార్యకర్త, నాయకుడు ఒక్కో సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఅర్ఎస్ ను అధికారంలోకి తెచ్చే విధంగా శక్తి వంచన లేకుండా పని చేయాలని సూచించారు.

కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలతో బీఅర్ఎస్ లో చిచ్చు పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారని, వారి ఎత్తులను చిత్తు చేసి మూడవ సారీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ బండారి రాంమూర్తి, బీఆర్ ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మన్, వైస్ ఎంపీపీ దాసరి చంద్రారెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్, డైరెక్టర్లు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ లక్ష్మన్, జిల్లా డైరెక్టర్లు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్లు, గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement