Saturday, May 4, 2024

సమస్యల సాధనకై లెక్చలర్స్‌ ధర్నా

పెద్దపల్లిరూరల్‌: సమస్యల సాధన కోసం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద టీఎల్‌ఎఫ్‌, టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో లెక్చరర్లు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌, రాష్ట్ర సమన్వయకర్త నాగయ్య, జిల్లా అధ్యక్షులు రాజేష్‌లు కోవిడ్‌- 19 నిబంధనలు పాటిస్తూ కళాశాలలు, పాఠశాలలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షాన జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ- పరీక్షలలో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుఉందన్నారు. అలాగే సంవత్సరం కాలం నుండి జీతాలు లేక దుర్భర పరిస్థితిలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ బి. సురేష్‌, రాజు, అధ్యాపకులు రమేష్‌, శ్రీధర్‌ అనిల్‌, రవీందర్‌, జహీర్‌, నిరంజన్‌, యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement