Sunday, May 5, 2024

జ‌గిత్యాల‌లో క‌రోనా స్ట్రెయిన్ క‌ల‌క‌లం….

జ‌గిత్యాల – జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త స్ట్రెయిన్ వైర‌స్ మూలాలు క‌నిపించ‌డంతో క‌ల‌క‌లం రేగింది.. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన ఒకే ఇంట్లో ఏడుగురికి ఈ వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి గత నెల 25న యూకే నుంచి ఇండియాకు వచ్చాడు. ఆయన నుంచి కుటుంబసభ్యులందరికీ ఈ వైరస్ సోకింది. ఇంట్లో వాళ్లందరూ అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా కొత్త స్టెయిన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దాంతో వెంటనే వారందరినీ హైదరాబాద్‌కు తరలించారు. కాగా.. వీరితో పాటు నెగటివ్ వచ్చిన మరో నలుగురు కుటుంబసభ్యులను కూడా విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.. అలాగే, కోరుట్ల మండలం వెంకటాపూర్‌లోనూ ఓ వ్యక్తికి ఇదే రకమైన కొత్త స్టెయిన్ సోకినట్లు గుర్తించడంతో హైదరాబాద్‌కు తరలించారు. జిల్లాలో ఒకేసారి రెండు ప్రాంతాలలో కరోనా కొత్త స్టెయిన్ బయటపడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement