Monday, April 29, 2024

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ కన్నెర్ర..

పెరిగిన నిత్యావసర ధరలను నిరనసగా కాంగ్రెస్ పోరుబాట పట్టింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలు పెంపు, వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ టిపిసిసి ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement