Tuesday, April 30, 2024

మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయండి.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మిషన్ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశించారు. శనివారం మంచిర్యాల ఐడిఓసి కలెక్టరేట్ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, మిషన్ భగీరథ ఈఎన్ సి కృపాకర్ రెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జ్ఞాన్ కుమార్, అంజన్ రావు, మధుసూదన్, ప్రకాష్ లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, నియోజకవర్గంలోని జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement