Tuesday, May 7, 2024

భట్టితో ఇబ్రహీంపట్నం నేత మర్రి నిరంజన్ భేటీ

యాచారం, జులై 15(ప్రభన్యూస్): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను గాంధీభవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా గాంధీభవన్ లో భట్టి విక్రమార్కని కలిసి శుభాకాంక్షలు తెలిపానన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎల్పీ నాయకులు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మండుటెండలో (1365) కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని దిగ్విజయంగా పూర్తి చేసుకొని గాంధీభవన్ కు విచ్చేసిన సందర్భంగా వారిని పార్టీ నేతలతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అని మర్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అనంతరం మాజీ పీసీసీ అధ్యక్షులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, వివిధ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement