Tuesday, April 30, 2024

చలి వేంద్రం..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని బొప్పాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టిఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్‌రావు, ఏఎం సీ చైర్మెన్‌ కొండ రమేష్‌గౌడ్‌లు ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో రైతులు, హమాలీలు, ఐకెపి సభ్యుల వేసవి దాహార్తి తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొండాపురం బాల్‌ రెడ్డి, ఎంపిటిసి ఇళ్లందుల గీతాంజలి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement