Thursday, April 18, 2024

ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ అనే వస్తోంది

కరోనా టెస్టులపై తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ అనే వస్తోందని ఆయన అన్నారు. టెస్టుల ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ ఆగవద్దని, అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని తెలిపారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయని, నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. తెలంగాణలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదని, బెడ్స్, టీకాలు, మందులూ అన్నీ అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనాను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని, 80 టన్నుల ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నామని ఈటల రాజేందర్ వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement