Sunday, May 5, 2024

ప్రశాంతంగా ఎస్ఐ రాతపరీక్ష.. సీపీ సుబ్బరాయుడు

ఎస్ఐ రాత పరీక్ష ప్రశాంతంగా జరుగుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. శనివారం పరీక్ష కేంద్రాలను పరిశీలించి కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ… 8, 9 తేదీల్లో పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో 18 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

కరీంనగర్ లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, మహిళ ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాల, వివేకానంద డిగ్రీ, పిజి కళాశాల, అపూర్వ డిగ్రీ కళాశాల, శ్రీ చైతన్య డిగ్రీ, పిజి కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, జేమ్స్ డిగ్రీ, పిజి కళాశాల, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, వికాస్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పిజి కళాశాల ఏర్పాట్లు చేశామన్నారు. నాలుగు పేపర్లు రాత పరీక్షను నిర్వహిస్తారని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుందని తెలిపారు. రాతపరీక్షకు 13, 547 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వివరించారు. సిపి వెంట కరీంనగర్ రూరల్ ఏసీపీ కర్ణాకర్ రావు, సిఐ రమేష్ తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement