Monday, April 29, 2024

ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాల ముగింపు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏకాంతసేవతో ముగింపు పలికారు. సోమవారం నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిసాయి. అర్చకులు వేణుగోపాలచారి నవీన్‌చారి గరుడోత్సవం సందర్భంగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయంలోనే ఊరేగించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ సూర నర్సయ్య, సర్పంచ్‌ నిమ్మ లక్ష్మి, బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు- ప్రకటించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన సీతారామచంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండానే జరిపినప్పటికీ ఘనంగా జరిపారు. ఈకార్యక్రమంలో లింగాల అంజా గౌడ్‌, మాజీ సర్పంచ్‌ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్‌ మహేందర్‌, ఎంపిటిసి ఆఫేరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement