Wednesday, May 1, 2024

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు..

సుల్తానాబాద్‌: రైతులు ఎంతో శ్రమించి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వీరగోని సుజాత రమేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. మండలంలోని గర్రెపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ గంగుల సంతోష్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులు తాము పండించిన కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వ నిర్ణయించిన ధరకు విక్రయించాలన్నారు. ఈకార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement