Thursday, May 2, 2024

బీమా చెక్కు పంపిణీ..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌ గ్రామంలో గత ఏడాది కరెంట్ షాక్‌తో చనిపోయిన బుర్రవేణి రామచంద్రం టీఆర్ ఎస్‌ లో సభ్యత్వం కలిగి ఉండడంతో మంజూరైన బీమా సొమ్మును టిఆర్ ఎస్ నాయకులు పంపిణీ చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామచంద్రం కుటుంబానికి భరోసా ఇస్తూ రూ. 2 లక్షల బీమా చెక్కును మండల ప్రెసిడెంట్‌ వరుస కృష్ణహరి, సర్పంచ్‌ కొండాపురం బాల్‌రెడ్డిలు అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు టిఆర్ ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు వంగ శివరాం, వార్డ్‌ మెంబెర్‌ నీరటి రాజాం, దేవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement